టాలీవుడ్ అందాల బ్యూటీ కియారా అద్వానీ అంటే తెలియని వారు ఉండరు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ  ఆ తర్వాత వచ్చిన అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. అలాంటి కియారా అద్వానీసినిమా తర్వాత వినయ విధేయ రామ అనే చిత్రం ద్వారా రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ మరోసారి గేమ్ చేంజర్ అనే సినిమాతో  రామ్ చరణ్ తో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. 

ఇలా ఆమె కెరియర్ కొనసాగుతున్న తరుణంలోనే ఈ అమ్మడు  షేర్షా సినిమాలో నటించి  ఇందులో హీరోగా చేసినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. అలా రెండు సంవత్సరాల పాటు కలిసి మెలిసి తిరిగిన వీరు  2023 ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అలాంటి కియారా అద్వానీ  ప్రెగ్నెంట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లో బేబీ బంప్ ఫోటోలు కనిపించడంతో ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుందని నెటిజన్స్ భావిస్తున్నారు. ప్రేక్షకులు ఇలా అనుకోవడానికి కారణం కూడా ఉంది.

అప్పట్లో ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని నాకు ఇద్దరు ఆరోగ్యమైన వంతమైన పిల్లలు కావాలని చెప్పింది. అందులో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి కావాలని కోరుకుంది. ఆమె కోరిక ప్రకారమే కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని చాలామంది అనుకుంటున్నారు. కియరాఅద్వానీ  ముందుగా ఆయనతో స్నేహం పెంచుకొని ఆ తర్వాత ప్రేమలో పడింది. అలా రాజస్థాన్ లోని సూర్యగడు హోటల్లో దగ్గర కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: