రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించాడు. అనేక సినిమాలలో కీలక పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అనంతరం 2011లో 'నువ్వెలా' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ హీరో అనేక సినిమాలలో వరుసగా అవకాశాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. గీత గోవిందం సినిమాతో ఎనలేని గుర్తింపు అందుకున్న ఈ హీరోసినిమా తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ అవన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. 


ప్రస్తుతం ఈ హీరోతో సినిమాలు చేయడానికి ఎవరూ కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం 'రెట్రో'. ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ చేసిన వాక్యాలు సంచలనంగా మారుతున్నాయి. మన్యం జిల్లా ఆదివాసి జేఏసీ నాయకులు హీరో విజయ్ దేవరకొండ పైన సీరియస్ అవుతున్నారు. "పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ లాగా కొట్టుకోవడం ఏంటి" అంటూ హీరో విజయ్ దేవరకొండ సంచలన కామెంట్లు చేశారు.


దీంతో జేఏసీ నాయకులు హీరో విజయ్ దేవరకొండ అలా మాట్లాడడం చాలా దారుణమని అంటున్నారు. గిరిజనుల చరిత్ర తెలిసినట్లుగా మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడడం సరికాదు అంటూ వారు మండిపడుతున్నారు. ఉపన్యాసాలు ఇచ్చే ముందు వారి స్థితిగతులను తెలుసుకోవాలని జేఏసీ నాయకులు అంటున్నారు. తక్షణమే విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు సీరియస్ అవుతున్నారు. మరి ఈ విషయం పైన హీరో దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి. వారు అడిగినట్లుగా క్షమాపణలు చెప్తారా... లేదంటే ఈ గొడవను మరింత పెరిగేలా చేస్తారా అనే సందేహంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: