
ఈ చిత్రానికి ప్రిన్స్ ధీమన్ దర్శకత్వం వహించగా, చౌహాన్ స్టూడియోస్ బ్యానర్పై కనుభాయ్ చౌహాన్ నిర్మించారు. ఇందులో ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కూడా ఒక యోధుడిగా 'వెగ్డా జి' పాత్రలో కనిపించనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధాన విలన్ 'జాఫర్ ఖాన్' పాత్ర పోషించారు. ఇక ఆకాంక్ష శర్మ అనే కొత్తమ్మాయి సినీ రంగ ప్రవేశం చేస్తూ... 'రాజల్' అనే నిర్భయమైన మహిళా యోధురాలి పాత్రలో కనిపించనుంది.
కేశరి వీర్ ట్రైలర్ను ముంబైలో ఏప్రిల్ 29, 2025న ఒక భారీ ఈవెంట్లో విడుదల చేశారు. ట్రైలర్ విజువల్స్... భీకరమైన యుద్ధ సన్నివేశాలు, ప్రాణ త్యాగాలు, తమ భూమి, విశ్వాసం కోసం నిలబడిన యోధుల మానసిక బలం వంటి వాటిని చూపించాయి. ఈ కార్యక్రమంలో సూరజ్ పాంచోలి చాలా ఎమోషనల్ అయ్యారు. సినిమా కోసం టీమ్ పడ్డ కష్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
'కేశరి వీర్' భారత చరిత్రలోని అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ధైర్యం, దేశభక్తి, త్యాగం అనే అంశాలపై ఈ కథ ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ సినిమా మే 16, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే, ఈ ట్రైలర్కు మిశ్రమ స్పందన వస్తోంది. ఒక చారిత్రక కథ చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని కొందరు ప్రశంసించినా... చాలా మంది ప్రేక్షకులు నటీనటుల నటనను, మొత్తం ప్రెజెంటేషన్ను విమర్శించారు. సోషల్ మీడియాలో కొందరు దీనిని భారీ బడ్జెట్ చారిత్రక చిత్రం 'ఛావా'తో పోల్చి... 'కేశరి వీర్' ఒక తక్కువ బడ్జెట్ వెర్షన్ లా ఉందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా సూరజ్ పాంచోలి, ఆకాంక్ష శర్మ వంటి అంతగా తెలియని నటీనటుల కాస్టింగ్ కూడా విమర్శలకు గురైంది. ఇవన్నీ ఉన్నా, సినిమా మాత్రం తన ఎమోషనల్, దేశభక్తి థీమ్తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తోంది.