ఇండస్ట్రీ లోకి ఎన్నో కలలతో చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమందికే భారీగా అవకాశాలు వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఫెయిల్యూర్  అయినా ఏదో ఒక విధంగా పాపులారిటీ అవుతున్నారు.. ముఖ్యంగా వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా ఓటీటిలలో సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలా ఆహా ఓటీటిలో గతంలో త్రీ రోజెస్ అనే ఒక బోల్డ్ వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఈషా రెబ్బ, పాయల్, పూర్ణ ఇలాంటి హీరోయిన్స్ మెయిన్ లీడ్ గా నటించారు. ఈ సిరీస్ 2021 లో రిలీజ్ అయింది.


ఈ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇటీవలే ఈ సిరీస్ కి సీక్వెల్ ని కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ లో కొత్త రోజ్ అని కుషిత కళ్ళకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ కి సంపాదించుకున్న కుషిత ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్గా నటించింది. సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఫోటోలతో ఉండే కుషిత కళ్ళకు తాజాగా త్రీ రోజెస్ గ్లింప్స్ చూస్తే అందర్నీ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తున్నది.


ఈ ముద్దుగుమ్మ గ్లింప్స్ లో తన బ్యాక్ లెస్ అందాలు కనపడేలా బెడ్ మీద ఉంటూ షాక్ ఇచ్చింది. దీంతో  కుషిత ఈ సిరీస్లో మరింత బోల్డ్ గా నటించబోతున్నట్లు హింట్ ఇచ్చిందని పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్ లో మరికొన్ని సన్నివేశాలు కూడా  ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా యూత్ని సైతం అట్రాక్ట్ చేసే విధంగా త్రీ రోజెస్ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మరి త్వరలోనే స్ట్రిమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా స్టార్ హీరోల చిత్రాలలో కుషిత కళ్ళపు అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: