సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫాన్స్ ఏ విషయం అయినా సరే ఓపెన్ గా చెప్పేయడం బాగా నేర్చుకున్నారు . ఒకప్పుడు ఫ్యాన్స్ కి స్టార్స్ కి మధ్య డిస్టెన్స్ ఉండేది.  ఏ విషయం అయినా సరే చర్చించాలి అంటే చాలా టైం పట్టేది.  కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా ఉంది.  సెకండ్స్ లోనే స్టార్స్ తో మాట్లాడేస్తున్నారు. స్టార్స్ కూడా అభిమానులతో అంతే దగ్గరగా ముచ్చటిస్తున్నారు.  లైవ్ చిట్ చాట్స్ చేస్తూ అభిమానులతో తమ ఇష్టా ఇష్టాలను షేర్ చేసుకుంటున్నారు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక పర్సనల్ విషయాన్ని చాలా హైలెట్ చేస్తున్నారు అభిమానులు .


సాధారణంగా మహేష్ బాబు అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది "హాండ్ సమ్" . ఆయన అంత హ్యాండ్సమ్ గా ఇండస్ట్రీలో మరొక హీరో లేరు అనడంలో సందేహం లేదు . పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ యంగ్ లుక్స్ లోనే కనిపిస్తూ మెప్పిస్తున్నాడు . అయితే మహేష్ బాబు పక్కన నమ్రత కన్నా  కూడా ది  ఫర్ఫెక్ట్ జోడిగా ఆ హీరోయిన్ సెట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  ఆమె మరెవరో కాదు "త్రిష". అందాల ముద్ద్గుమ్మ త్రిష. చెన్నై చంద్ర.



మహేష్ బాబు - త్రిష కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? వేరే లెవెల్ . సౌందర్య - వెంకటేష్ కాంబోలకి ఎంత క్రేజ్ వచ్చిందో మహేష్ బాబు - త్రిష ల కాంబోకి కూడా అంతే క్రేజ్ వచ్చింది . కాగా చాలామంది "అతడు" సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు పక్కన త్రిషని చూసిన తర్వాత నమ్రత  కన్నా కూడా మహేష్ బాబు పక్కన త్రిషనే సూట్ అయ్యింది అని బాగా చక్కగా ఆకట్టుకుంది అని.. పర్ఫెక్ట్ జోడి వీళ్ళది అని రకరకాలుగా మాట్లాడుకున్నారు.  మరొకసారి అదే విషయాన్ని వైరల్ చేస్తున్నారు జనాలు . నమ్రత శిరోద్కర్ - మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ మ్యారీడ్ లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళుతుంది . వీళ్ళకి ఇద్దరు పిల్లలు . త్వరలో సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: