దగ్గుపాటి రానా కొన్ని సంవత్సరాల క్రితం నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కేథరిన్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2017 వ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యం లో ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 8.58 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 3.9 కోట్లు , ఉత్తరాంధ్రలో 3 కోట్లు , ఈస్ట్ లో 1.9 కోట్లు , వేస్ట్ లో ఒక కోటి , గుంటూరు లో 1.54 కోట్లు , కృష్ణ లో 1.54 కోట్లు , నెల్లూరులో 58 లక్షల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.19 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 1.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 1.95 కోట్ల కలెక్షన్ దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 25.04 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి 25.04 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టడంతో ఈ మూవీ 5.04 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో సూపర్ హిట్గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: