ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వార్ 2, కూలీ మూవీల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2కు సపోర్ట్ చేస్తుంటే, రజనీకాంత్ ఫ్యాన్స్ కూలీకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమాను తెగ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్‌గా దేశాన్ని అల్లాడిస్తున్న ఏఐ టెక్నాలజీని వాడుకొని, ఏ హీరో ఫ్యాన్స్ తమ హీరో సినిమాకి మరింత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం ఇప్పుడు హైలైట్‌గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కూలీ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌ను మోగించేస్తున్నాయి. “ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది” అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


దీనికి కాంపిటీషన్‌గా బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఇద్దరు బడా స్టార్ హీరోలు కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ "వార్ 2" కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. “ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుంది” అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్ 2 హిట్ అవుతుందా? కూలీ హిట్ అవుతుందా? అంటూ రకరకాల పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఒక వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో యాంకర్‌గా ఉన్న ఓ ఆవిడ, హాస్పిటల్ బెడ్‌పై పడుకున్న చిన్న బాబును “కూలీ సినిమా చూస్తావా? లేక వార్ 2 సినిమా చూస్తావా?” అని అడుగుతుంది. వెంటనే ఆ బాబు లేచి “నేను ఖడ్గం సినిమా చూస్తాను టీవీలో” అని చెబుతాడు.



ప్రతి ఏడాది ఆగస్టు 15న టీవీలో ఖడ్గం సినిమా ప్రసారమవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంతోనే, రెండు బిగ్ బడా సినిమాలు రిలీజ్ అయినా సరే, అందరూ ఖడ్గం సినిమాకే ఓటు వేస్తారని సెటైరికల్‌గా ఈ వీడియోని క్రియేట్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. “ఈ వీడియో చాలా సరదాగా, ఫన్నీగా ఉంది” అంటూ మాట్లాడుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: