ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్లో పలు సినిమాల్లో అలరించినా నేహా శర్మకు హిట్ మాత్రం అందలేదు. కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆమె, తరువాత సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్గా ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఆమె డైరెక్టర్గా మారిపోయింది. ఇదే న్యూస్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్లో ట్రెండ్ అవుతోంది. నేహా శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాక సంఘటన ఆధారంగా 1945 బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సిద్ధాంత్ చతుర్వేది, అలాగే మోహిత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది నిజంగా ఆమెకు లక్కీ చాన్స్. స్టార్టింగ్ సినిమాతోనే స్టార్స్ను ఆకర్షించడం హైలైట్ పాయింట్ అని అభిమానులు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిలబెట్టేందుకు నేహా శర్మ పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, బ్యాక్గ్రౌండ్లో మాత్రం పూర్తిగా పనులు చకచకా జరుగుతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.,ఈ చిత్రంతో ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ దర్శకురాలిగా కూడా మంచి పేరు సంపాదించుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి