దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార.. సౌత్ ఇండస్ట్రీనీ ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగు ,తమిళ్ వంటి భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి పేరు సంపాదించుకుంది. నయనతార ప్రేమించి ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది.. తన పిల్లలతో భర్తతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటోంది. నయనతార డాక్యుమెంటరీ చూస్తే అభిమానులకు ఆనందమేసినప్పటికీ కానీ నయనతార మాత్రం ఎందుకు తీశానా ?అని తలలు పట్టుకునేలా చేస్తోంది డాక్యుమెంటరీ. ఏ ముహూర్తాన ఈ డాక్యుమెంటరీకి సైన్ చేసిందో కానీ అప్పటినుంచి ఈమె చుట్టు ఎక్కువగా చిక్కులే కనిపిస్తున్నాయి.


ఇప్పుడు తాజాగా నయనతార ఖాతాలో మరో తలనొప్పి చేరింది. ప్రతిసారి ఈ డాక్యుమెంటరీలో ఏదో ఒక చిన్న తప్పు కనిపించడం దీనిపైన నయనతారను కోర్టుకు లాగడం వంటివి చాలా కామన్ గా మారిపోయింది. చంద్రముఖి నిర్మాతలు ఈమెకు నోటీసులు  తాజాగా జారీ చేశారు.. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాతోనే నయనతార స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. అందులో ఉండే కొన్ని విజువల్స్ తన డాక్యుమెంటరీలో ఉపయోగించారు. వారి అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్పులను ఉపయోగించడంతో వారు హైకోర్టుని ఆశ్రయించారు.


ఈ విషయం పైన  నెట్ ఫ్లిక్స్ కు హైకోర్టు నోటీసులు జారీ చేయగా అక్టోబర్ 6వ  తేదీలోపు సమాధానం చెప్పాలని జారీ చేశారు. గతంలో హీరో ధనుష్  కూడా డాక్యుమెంటరీ పైనే తన అనుమతి లేకుండా నయనతార నటించిన నేను రౌడీనే క్లిప్ ఉపయోగించినందుకు  రూ.10 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి ధనుష్ ప్రొడ్యూసర్. నయనతార ఈ డాక్యుమెంటరీ కి సంతకం చేయకుంటే ఈ బాధలన్నీ తప్పేవి. ఈ డాక్యుమెంటరీ వల్ల నయనతార జీవితాన్ని ముప్పు తిప్పలు పెట్టాలా చేసుకుంటోంది. మరి వీటన్నిటిని నయనతార ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: