టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 15వ తేదీన ఈ సినిమాకి సంబంధించి భారీ ఎత్తున గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం కోసం రామోజీ ఫిలిం సిటీలో 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ఇలా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి వరుసగా అప్డేట్లను ఇస్తూ ఉన్నారు రాజమౌళి.


తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పాటలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పాడడం ఈ సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. శృతిహాసన్ పాడిన తీరుచూస్తూ ఉంటే గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. శృతిహాసన్ ఈ పాటలో తన మ్యూజికల్ టాలెంటుని మరొకసారి చూపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సంచారి అనే ఈ పాటలో మహేష్ బాబు పాత్ర వీరత్వాన్ని ఆమె వర్ణిస్తూ  వివరించిన తీరు అద్భుతంగా కనిపిస్తోంది. ఈ పాట అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.


లిరికల్ వీడియోలో శృతిహాసన్ పాడుతున్న విజువల్స్ కూడా అద్భుతంగా చూపించారు. ఆమె పాడుతున్న తీరును బట్టి చూస్తూ ఉంటే అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు సంపాదించిన కీరవాణి అందిస్తున్న ట్యూన్ కూడా ఈ పాటకు మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తోంది. వాస్తవంగా ప్రియాంక చోప్రా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజున విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. మరి ఇందుకు సంబంధించి రాజమౌళి సడన్ ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. ఈ సినిమా సుమారుగా రూ .1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గత సినిమాలలో ఎప్పుడు చేయని విధంగా రాజమౌళి మహేష్ బాబు సినిమాకి చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: