దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార ఎప్పుడూ తన ఎంపికలతోనే కాదు, తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో జతకట్టుతూ వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ దక్షిణాది టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. అలాగే బాలయ్య నటిస్తున్న తదుపరి చిత్రానికి కూడా నయనతార నే ఓకే చేశారట.


ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టాక్ చక్కర్లు కొడుతోంది. ఎంత పారితోషికం ఇచ్చినా ఒక ప్రత్యేక హీరో పక్కన మాత్రం నటించనని నయనతార చెప్పిందన్న రూమర్ వినిపిస్తోంది. ఆ హీరో మరెవరో కాదు—తమిళ నటుడు శరవణన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ది లెజెండ్’ చిత్రం 2022లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని శరవణన్ టీమ్ తీవ్రంగా ప్రయత్నించినట్లు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఆమె అంగీకరించలేదని, చివరికి నయనతార స్థానంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఎంపికయ్యారని సమాచారం.



ఇక మరో ప్రచారం ఏమిటంటే—ఈ సినిమాలో తనని నటింపచేయడానికి 100 కోట్లు ఇచ్చినా కూడా శరవణన్ పక్కన నటించనని నయనతార అన్నట్లుగా పుకారు. బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి నాయికలు పారితోషిక పరంగా చాలా ముందున్నప్పటికీ, స్క్రిప్ట్ మరియు సహనటుడు తనకు నచ్చితేనే సినిమా చేస్తానని నయన్ ఎప్పుడూ స్పష్టం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నయనతార సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా వేగంగా ఎదుగుతోంది. స్కిన్ కేర్ బ్రాండ్, ప్రొడక్షన్ హౌస్, దుస్తుల బ్రాండ్‌లతో పాటు పలు వ్యాపారాల్లో ఆమె పెట్టుబడులు పెట్టి మల్టీ–టాలెంటెడ్ ఎంట్రప్రెన్యూర్‌గా మారుతోంది. తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టమైన ప్రణాళికతో నడుచుకునే నయనతార, ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకునే నటి అనే పేరును ఇప్పటికే సంపాదించింది. అలాంటి నయనతార పై ఇలాంటి రూమర్ హాట్ గా ట్రెండ్ అవుతూ ఉండటం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: