భారతదేశ ప్రధాన మంత్రి రెండవ సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తర్వాత మంచి జోష్ మీద ఉన్నారు. గత ఎన్నికల అనంతరం 2019 ఎన్నికల  ప్రచారం భాగంగా ప్రధాని పలు చోట్ల పర్యటించారు. సోమవారం ప్రధానికి సంబందించిన ఒక విడియో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. అది ఏమిటంటే ప్రధాని సాహాస యాత్ర.... ప్రధాన మంత్రి సాహాస యాత్ర చేశారా అని ఆశ్చర్యపోకండి. నిజమండి కావాలంటే మీరే చూడండి

ప్రపంచంలోని అనే ప్రదేశాలకు వేళ్ళి అక్కడ మనుగడ ఏలా సాగించాలో ప్రజలకు తెలియజేసే సాహాస వీరుడు బేర్ గ్రిల్స్. ఇతను భారత దేశంలో చేసిన సాహాస యాత్రలో దేశ ప్రధాని మోదీ కూడా అందలో పాల్గొన్నారు. తాజాగా ఆయన... డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసే ప్రఖ్యాత కార్యక్రమం మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ ఛానల్ విడుదల చేసింది. బేర్ గ్రిల్స్‌తో మోదీ కలిసి చేసిన సాహస ప్రయాణాన్ని డిస్కవరీ ఛానల్ ఆగస్ట్ 12న చూపించబోతోంది.

మోదీ తనతో కలిసి ఎలాంటి సాహసాలు చేశారో...ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న 180 దేశాల్లో ప్రేక్షకులు చూడాలని కోరారు. పర్యావరణ మార్పులకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక కథనంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి... ఈ కార్యక్రమంపై ఆసక్తిని పెంచారు.

వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టికోణంతో భారత్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. భారతదేశ మహోన్నతమైన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. ప్రధాని మోదీతో కలిసి భారతదేశ అరణ్య ప్రాంతాల్లో సాహసాలు చేయడం గౌరవంగా భావిస్తున్నానని బేర్‌ గ్రిల్స్‌ తెలిపారు. ఈ విషయాన్ని బేర్ గ్రిల్స్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: