ప్రస్తుతం సభ్య సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు రోజురోజుకీ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనల తో అసలు సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెల కొంటుంది. కనీసం మానవత్వాన్ని మరుస్తున్న మనుషులు ఏకంగా క్రూర మృగాలు గా మారి పోతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నాగరిక సమాజంలో కూడా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఎంతోమంది ప్రస్తుతం దారుణాల కు పాల్పడుతున్నారు.



 ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన జరిగింది సాధారణం గా జూదం కారణంగా ఎంతో మంది ఏకంగా ఆస్తులు సైతం కూడబెట్టి చివరికి రోడ్డు పాలవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  జూదం ఆడిన కారణం గా ఇప్పటికే ఎంతోమంది రోడ్డు పాలు అయిన ఘటనలు కూడా తెర మీదకు వచ్చాయి.  కానీ ఇక్కడ మాత్రం మరింత దారుణం జరిగి పోయింది. ఏకంగా జూదం లో ఓడిపోయిన  వ్యక్తి యొక్క భార్యను స్నేహితులకు అప్పచెప్పాడు దీంతో ఆమెపై స్నేహితులు సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. కనీసం మనుషులనేఈ విషయాన్ని మరిచిపోయి క్రూరమృగాల లాగా మీద పడి పోయి అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చి స్థానికంగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది.



 బీహార్లోని భాగల్పూర్ జిల్లా లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  సోను అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి జూదం ఆడాడు.ఈ క్రమంలోనే జూదంలో ఓడిపోయినందుకుగాను అతని స్నేహితులు ఏకంగా సోను భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జూదంలో ఓడి నందుకు భర్త భార్యను స్నేహితులకు అప్పగించడం గమనార్హం. ఇక అత్యాచారం చేసిన తర్వాత భార్య పవిత్రంగా ఉండాలని ఏకంగా యాసిడ్ పోసాడట భర్త.ప్రస్తుతం బాధితురాలు గాయాల నుంచి కోలుకుంటోందని తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: