ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పై టి‌డి‌పి రాష్ట్ర అద్యక్షుడు అచ్చేన్నాయుడు మరోసారి రెచ్చిపోయాడు.జగన్ ఒక దుర్మార్గుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర రాజధాని అమరావతి అని ఆనాడు ఒప్పుకున్న జగన్ ఈ నాడు రాజధాని మార్పు పై ఎందుకు ఆసక్తి చూపుతున్నాడో సమాధానం చెప్పాలని కోరాడు.జగన్ ఒక పిచ్చి తుగ్లక్ లాగా కక్ష రాజకీయాలు చేస్తున్నడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అమరావతిని రాజధానిని హత్య చేసి నేటికి సంవత్సరం అయ్యిందని  అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ లెంపలు వేసుకుని అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.ఈ ముఖ్యమంత్రి తన మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ద్వాజమెత్తారు.  ఓ వైపు అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని జనభేరి సభ జరుగుతుంటే.. దుర్మార్గుడు బీసీల సభ పెట్టడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్య మంత్రి జగన్ అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు . ఈ మూర్ఖపు ముఖ్యమంత్రే ఆనాడు రాజధాని అమరావతికి ఒప్పుకున్నారన్నారు. కొందరు చేతగాని దద్దమ్మలైన ఈ ప్రభుత్వ మంత్రులు తనను రాజీనామా చెయ్యమంటున్నారని  రాజీనామా చేయాల్సింది తాను కాదని... ఈ ప్రభుత్వమే ముందు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు.జగన్ ఒక పిచ్చి ముఖ్యమంత్రి అని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయిందని అచ్చేన్నాయుడు తీవ్ర స్థాయిలో ద్వాజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: