సరిహద్దుల్లో యుద్ధ వాతావారణానికి కారణమైన చైనా... ఇప్పటికీ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీనిపై ఇప్పటికే కమాండర్ స్థాయి చర్చలు జరిగిన కూడా... ఫలితం ఏ మాత్రం కనిపించడం లేదు. సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరిస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ. అదే సమయంలో భారీ నిర్మాణాలు కూడా చేపడుతోంది. సరిహద్దుల వరకు వేగవంతమైన ప్రయాణం కోసం బుల్లెట్ రైల్వే ట్రాక్ కూడా ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ. టిబెటి రీజియన్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. అత్యవసర పరిస్థితుల కోసం హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయంపై ఓ నివేదిక అందించింది. సుప్రీం కోర్టులో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నివేదికను సమర్పించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. తన పరిధిని చైనా క్రమంగా విస్తరిస్తోందని కూడా అటార్నీ జనరల్ నివేదికలో స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో యుద్ధ వాతావారణానికి కారణమైన చైనా... ఇప్పటికీ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీనిపై ఇప్పటికే కమాండర్ స్థాయి చర్చలు జరిగిన కూడా... ఫలితం ఏ మాత్రం కనిపించడం లేదు. సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరిస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ. అదే సమయంలో భారీ నిర్మాణాలు కూడా చేపడుతోంది. సరిహద్దుల వరకు వేగవంతమైన ప్రయాణం కోసం బుల్లెట్ రైల్వే ట్రాక్ కూడా ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ. టిబెటి రీజియన్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. అత్యవసర పరిస్థితుల కోసం హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయంపై ఓ నివేదిక అందించింది. సుప్రీం కోర్టులో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నివేదికను సమర్పించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. తన పరిధిని చైనా క్రమంగా విస్తరిస్తోందని కూడా అటార్నీ జనరల్ నివేదికలో స్పష్టం చేశారు.