రాష్ట్రం విడిపోయాక ఏపీకి రాజధాని లేని విషయం తెలిసిందే. తెలంగాణకు హైదరాబాద్ వెళ్లిపోవడంతో, ఏపీకి రాజధాని లేకుండా పోయింది. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుభవం ఉంది, రాజధాని కడతారని చెప్పి ఏపీ ప్రజలు గెలిపించారు. ఇక చంద్రబాబు గెలిచాక కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే 29 గ్రామాల్లో 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. రైతులకు అందులో కొంతభూమిని అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పారు.