ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బయటపడేందుకు కష్టపడుతున్నారు. పార్టీ నేతలని యాక్టివ్ చేసి అధికార వైసీపీకి ధీటుగా ఉండేందుకు చూస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. ఇంకా పార్టీలో కీలక పదవులని భర్తీ చేశారు.