టీడీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వెళ్ళాక చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. పలువురు నేతలు పార్టీని వీడితే మరికొందరు పార్టీకి దూరంగా జరిగారు. అయితే కొందరు నేతలు నిదానంగా మళ్ళీ పార్టీలో కనిపించడం మొదలుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ టీడీపీ కనిపించడం లేదు. అలా అని వారు పార్టీని కూడా వీడలేదు. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చుట్టూనే ఉన్న వియ్యంకులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.