తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ-జనసేన పార్టీలు ఓ అవగాహన వచ్చినట్లు కనిపించడం లేదు. తిరుపతిలో జనసేన మద్ధతుతో తామే పోటీ చేస్తున్నామని బీజేపీ ముందే ప్రకటించేసింది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక కోసం కమిటీలు కూడా నియమించుకుని ముందుకెళుతుంది. అయితే ఈ విషయంలో జనసేన కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.