2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుకు జగన్ టిక్కెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతిపక్ష టీడీపీ నేతల నుంచి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు, అసలు రాజుగారు ఎంపీగా గెలిచాక ఏం చేశారనే విషయంలోకి వెళితే, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, కొన్నిరోజుల పాటు పార్టీలో బాగానే నడిచారు. కానీ తర్వాత రాజుగారు పూర్తిగా ప్రతిపక్ష నాయకుడుగా మారిపోయారు. డైలీ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు.