ఏపీ శాసనమండలి రద్దుకు సీఎం జగన్ మొగ్గుచూపడం ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో, ప్రతి బిల్లుకు అడ్డంకి ఎదురుకావడంతో సీఎం జగన్ గతేడాది మండలి రద్దుకు మొగ్గుచూపారు. అసెంబ్లీలో మండలి రద్దు బిల్లు పెట్టి, దానికి ఆమోదముద్ర వేసి, కేంద్రానికి పంపారు. అయితే ఆ రద్దు అంశం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదుగానీ, మండలి రద్దు కానుండటంతో ఎమ్మెల్సీలుగా ఉండి, తన కేబినెట్లో ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణల చేత జగన్ రాజీనామా చేయించారు.