ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. తమ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి, తమ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న రఘురామ చాప్టర్ క్లోజ్ చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. అందుకే మొదట ఆయన ఎంపీ పదవిపై వేటు వేయించాలని వైసీపీ చూస్తుంది.