చంద్రబాబు అధికారంలో ఉండగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనీ ఇష్టారాజ్యంగా టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని సైతం చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావుని సైతం టీడీపీలో చేర్చుకున్నారు.