ఏపీలో మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే లాబీయింగ్ చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో జగన్ రెండో విడత కేబినెట్ విస్తరణ చేయనుండటంతో పెద్ద సంఖ్యలో ఆశావాహులు మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.