ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇంకా పుంజుకోలేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు దూకుడుగా ఉండటం లేదు. అలాగే దూకుడుగా ఉండే నేతలు సైతం టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ హవా ఉన్న రాయలసీమ జిల్లాలలోని టీడీపీ నేతలు, తమ భవిష్యత్ విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.