వైసీపీ నేతలు.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. నిజానికి విశాఖ క్యాపిటల్ సిటీ అని వైసీపీ సర్కార్ ప్రతిపాదించేంతవరకూ కూడా రాజు గారి జోలికి ఎవరూ పోలేదు. ఆయన కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు. దానికి కారణాలు అనేకం. ఆయన పట్ల టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపం చెంది గమ్మున ఉంటూ వస్తున్నారు. ఆయన మాన్సాస్ బాధ్యతలు ఏవో నిర్వహించుకుంటూ తన మానాన తాను ఉన్నారు. అయితే విశాఖ పాలనా రాజధాని కావడంతో వైసీపీ పెద్దల కన్ను సింహాచలం భూముల మీద పడింది అని చెబుతారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ కి కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి.