బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బైరెడ్డి...ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా టీడీపీ కీలకంగా పనిచేసిన బైరెడ్డి ఊహించని విధంగా టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. అలాగే రాయలసీమ పరిరక్షణ సమితి పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ హక్కులు కోసం గట్టిగానే పోరాడారు.