కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై అడ్వకేట్ జేఏసీ నేత గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ న్యూస్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జీవితమంతా చీకటిమయం అని అన్నారు. రేవంత రెడ్డి గతంలో ఒక సాధారణ పెయింటర్ అని సూర్యభగవాన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర పెయింటర్ గా పని చేశాడని చెప్పారు. జడ్చర్ల, వనపర్తిలో చాలా చోట్ల ఆర్ట్ బై రేవంత్ అని ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. 
 
రేవంత్ రెడ్డి తండ్రికి కొండారెడ్డి పల్లిలో 9 ఎకరాల భూమి మాత్రమే ఉందని.. మామూలు పెయింటర్ వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. రేవంత్ కు జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పారు. ఆర్టీఐలు వేసి రేవంత్ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం డ్రోన్ ను ఎగరవేయడం స్వేచ్ఛను హరించడమే అని పేర్కొన్నారు. 
 
గోవర్ధన్ రెడ్డి రేవంత్ పై చేసిన ఆరోపణల గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కబ్జాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్ల ద్వారా జీరో స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగాడని ప్రచారం జరుగుతోంది. తొలినాళ్లలో రేవంత్ వనపర్తిలో ఒక సాధారణ పెయింటర్ కాగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బ్యానర్లు రాసే కాంట్రాక్టు దక్కడంతో అతని లైఫ్ టర్న్ అయింది. అప్పటి నుంచి రేవంత్ కు రాజకీయ నేతలతో పరిచయాలు పెరిగాయి. 
 
ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి సోదరుడి కుమార్తెతో ప్రేమ వివాహం జరగడంతో రేవంత్ జీవితమే మారిపోయింది. పైకి క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ లా రేవంత్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో రేవంత్ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు. బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మిడ్జిల్ లో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్, ఆ తర్వాత, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ కావడం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: