మనిషి గుడ్డు పెట్టడం ఎక్కడైనా విన్నారా లేదు కదా.. ఇప్పుడు ఒక విషయం అందరినీ ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తుంది..అదేంటంటే ఓ మహిళ గుడ్డు అక్కడ పెట్టుకుంది.. దాంట్లో నుంచి పిల్ల బయటకు వచ్చిందట.. నిజమండీ.. వివరాల్లోకి వెళితే..నుషులు గుడ్లు పెట్టలేరు. కానీ, వాటిని పొదిగి పిల్లలుగా మార్చేయవచ్చని తెలిసిందే. అయితే, ఈ మహిళ ఎక్కడ చోటులేనట్లు తన బ్రాలోనే రొమ్ముల మధ్య గుడ్డును పెట్టుకుని పొదిగింది.


 

 

అయితే అలా 35 రోజులు బ్రాలోనే గుడ్డును పెట్టుుంది. ఎట్టకేలకు పండంటి బాతు పిల్లకు జన్మనిచ్చింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని విశాలియాలో చోటుచేసుకుంది.బెట్సే రాస్ అనే మహిళ తన పిల్లలతో కలిసి పార్కుకు వెళ్లింది. అక్కడ ఓ చోట బాతు గూళ్లు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి బాధపడింది. గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లను కూడా చిదిమేశారు. అయితే, వాటిలో ఒక గుడ్డుకు మాత్రం ఏమీ కాలేదు. 


 

 

 గుడ్డు పెచ్చు కొంచం విరిగింది.. ఆమె పిల్లలు ఆ గుడ్డును తీసుకెళ్దాం అని పిల్లలు అడగటంతో ఆమె కాదనలేక పోయింది..అయితే, గుడ్డు నుంచి పిల్ల రావాలంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. ఇంట్లో ఇన్‌క్యుబేటర్ కూడా లేదు. దీంతో ఆమె స్థానిక వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆర్గనైజేషన్‌కు ఫోన్ చేసింది. అయితే, వాళ్లు గుడ్లను తీసుకోమని తెలిపారు. దీంతో బెట్సే స్వయంగా ఆ గుడ్డును పొదగాలని నిర్ణయించుకుంది. 


 

 

గుడ్లు పిల్లలుగా మారాలంటే వాటికి తేమతో కూడిన వెచ్చని ప్రదేశం కావాలని తెలుసుకున్న ఆమె అలాంటి ప్రాంతం కోసం వెతికింది. కానీ, ఫలితం లేకపోయింది. తన శరీర ఉష్ణోగ్రతతో గుడ్డును పొదగవచ్చని భావించింది. తన బ్రాలో రొమ్ముల మధ్య గుడ్డును పెట్టుకుంది. అలా 35 రోజులుపాటు ఆ గుడ్డును జాగ్రత్తగా బ్రాలోనే పెట్టుకుని తిరిగింది. ఎట్టకేలకు ఆ గుడ్డు నుంచి బాతుపిల్ల బయటకు వచ్చింది. దీంతో బెట్సే, ఆమె పిల్లల సంతోషానికి అవధులే లేవు. బేట్సే ఇప్పుడు ఆ బాతును కూడా తన సొంతం బిడ్డగా సాకుతోంది.పిల్లలు కుడా తమరు సోదరుడు లాగే చూస్తుండటం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: