అభం శుభం తెలియని ఆడపిల్ల పాలిట బంధువే చివరికి యమకింకరుడు గా మారిపోయాడు. ఏకంగా ఆటలు ఆడుతూ సంతోషంగా గడుపుతున్న బాలికను మాయ మాటల తో నమ్మించి చెవి దుద్దులు దొంగతనం చేయాలి అనుకున్నాడు. కానీ బాలిక కేకలు వేయడంతో చివరికి ప్రాణం తీసాడు. ఈ ఘటన తో అప్పటి వరకు తమ ముందే ఆడుకుంటున్న కూతురు  విగతజీవి గా మారిపోయింది అన్న విషయాన్ని తల్లి దండ్రులు జీర్ణించుకోలేకపోయారు. స్థానికంగా ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.



 ఈ దారుణ ఘటన చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం చిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల అంజలి ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుబయట ఆడుకుంటూ ఆడుకుంటూ బంధువుల ఇంటికి వెళ్ళింది. సదరు బాలికకు మేనమామ వరుస అయ్యే వంశీ అనే వ్యక్తి బాలికకు ఉన్న బంగారు చెవి దుద్దులను  దొంగతనం చేయాలని భావించాడు. అప్పటికే క్రికెట్ బెట్టింగ్ లో  ఎన్నో డబ్బులు కోల్పోయిన వంశీ చేవి దుద్దులు  దొంగతనం చేసి  వాటిని అమ్మి అప్పు తీర్చాలి అని అనుకున్నాడు.



 ఈ క్రమంలోనే సదరు బాలికకు మాయమాటలు చెప్పి దుకాణానికి పంపించాడు. సమీపంలో ఉన్న ఓ పాత ఇంటి వద్ద ఉంటానని అక్కడికి అగ్గిపెట్టె తెచ్చివ్వమని  అంటూ సదరు బాలికకు మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే బాలిక దుకాణంలో అగ్గిపెట్ట తీసుకొని పాడుబడ్డ ఇంటికి వెళ్ళగానే చెవి దిద్దులు అపహరించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక గట్టిగా అరిచింది. అరుపులు ఎవరికీ వినిపించకుండా నోరు గట్టిగా నొక్కి పెట్టడం తో ఊపిరాడక బాలిక మృతి చెందింది. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించగా బాలిక మృతదేహం లభించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: