షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన భర్తను వదిలేసి.. ఆటో డ్రైవర్ తో సహజీవనం చేస్తోంది. క్రమంలోని ప్రియుడితో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది సదరు వివాహిత. చిలక చెరువు వద్దకు వచ్చి చెరువులో దూకింది. చెరువుగట్టున మద్యం తాగుతున్న వినిష్ అభిషేక్ వివాహితను గమనించారు, క్రమంలోని వినీష్ వివాహితను కాపాడేందుకు ప్రయత్నించాడు. అంతలో అతడికి సెల్ఫీ వీడియో తీసుకోవాలని కోరిక పుట్టింది.
సదరు మహిళను కాపాడుతూ సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించగా చివరికి మద్యం మత్తులో ఉండడంతో నీట మునిగి పోయి మృతిచెందాడు. ఇక తర్వాత రోజు చెరువులో శవమై కనిపించాడు. ఇక ఆ తర్వాత తన కొడుకును మద్యం తాగించి స్నేహితులు హత్య చేసి ఉంటారు అని వినీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో ఇవన్నీ నిజాలు బయట పడడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వివాహిత ప్రియుడు సదరు వివాహిత కూడా నీటిలో మునిగి చనిపోయింది అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వివాహిత మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.