ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సోమవారం నుంచి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకే  సోమవారం ఉదయం 8 గంటలకు బీఏసీ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ భేటీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ప్రవేశ పెట్టే బిల్లులు, తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతలు చర్చించుకోవడం జరుగుతుంది.

ఇక ఈ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా  యువతను దారిలోకి తీసుకొచ్చే కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ముఖ్యంగా గ్యాంబ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జగన్  ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అంశాలను కూడా చేరుస్తూ చట్టాన్ని తీసుకురావాలని జగన్ ఆలోచిస్తున్నారు.ఇదిలా ఉంటే, అసెంబ్లీ సమావేశాల్లో జగన్  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సహా టీడీపీ సభ్యులు నివాళులు అర్పించబోతున్నారు.


అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లో దాదాపు 20 అంశాలపై చర్చ జరపాలని చంద్రబాబు నాయుడు  పట్టుపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి, ఇసుక పాలసీ, పోలవరం ప్రాజెక్టు, స్థానిక ఎన్నికలు, దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు బాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అలాగే సభను కనీసం 10 రోజులైనా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ నేతలు నిర్ణయించడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: