యవ్వన జీవితం మొదలు కాకుండానే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ గుండుగెరి ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే యువతి శేఖర్ అనే యువకుడితో ప్రేమ కలాపాలు సాగించింది. అంతేకాదు హైదరాబాద్ పహాడీ షరీఫ్ కు చెందిన మరో యువకుడు ఆసీస్ ఖురేషిని కూడా ప్రేమించింది. ఈ త్రికోణపు ప్రేమాయణం లో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరు కలిసి శేఖర్ అడ్డు తొలగించేందుకు దారుణమైన ప్లాన్ చేసారు.
అనుకున్న ప్లాన్ ప్రకారం అతన్ని బీర్లు తాగించి అతి దారుణంగా కత్తుల తో పొడిచి చంపారు.ఈ హత్య కేసును క్షుణ్ణంగా ధర్యాప్తు చేసి, కేసుకు సంబందించి అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, పై ఇరువురు నిందితుల మీద చార్జ్ షీట్ దాఖలు చేసినారు. నిందితులు యం.డి. ఆసిఫ్ ఖురేషీ యం.డి. పర్వీన బేగమ్ ఇద్దరికీ యవజీవ కారాగార శిక్షతో పాటుగా, ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా కూడా విదించింది కోర్టు. ఈ కేసు లో మృతుని తల్లిదండ్రులు, సోదరులు ఇతర సాక్షులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్ల నిందితులకు శిక్ష పడింది..