కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో రోజుకి కొన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక మన తెలంగాణలో కూడా
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లకు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ చక్కటి శుభవార్త చెప్పడం జరిగింది.
కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 45వేల మందికి లబ్దిచేకూరనుంది.కేసీఆర్ నిర్ణయంతో అక్కడి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2వేలు ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
దీనికి సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో
స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవతా దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.నిజంగా
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి అక్కడి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...