ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది  రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అతి తక్కువగా ఉంది. చూస్తూ చూస్తుండగానే వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  వెరసి రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వరకు కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తున్నాయ్ ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహనతో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.




 ఇకపోతే రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు  ఈ వైరస్ ప్రజలందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీంతో అందరు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు  అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతూ కోరలు చాస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు తగ్గు ముఖం పడుతుంది అన్నదానిపై ఇటీవలే  ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తికర నివేదికను సిద్ధం చేశారు.



 గుంటూరు జిల్లా మంగళగిరి లో ని ఎన్ఆర్ ఎస్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం  వైరస్ ఎప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది అనే దానిపై ఒక అంచనా నివేదికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రతి రోజూ 20 వేల కేసుల వరకు నమోదవుతున్నాయని అయితే ఈ నెల 30 వరకు కరోనా వైరస్ కేసులు 5 వేలకు తగ్గిపోయే అవకాశం ఉంది అంటూ నివేదికను విద్యార్థులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసిన డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేసారు. ఈనెల 20వ తేదీ వరకు పది వేల కేసులు, 30వ తేదీ వరకు ఐదు వేల కేసులు,జూన్ 14వ తేదీ వరకు వెయ్యి కేసులు, జూన్ 23వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల కేసులు.. జూలై 15వ తేదీ వరకు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 100 కేసులు మాత్రమే నమోదవుతయాని విద్యార్థులు నివేదికలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: