ఒకప్పుడు మన ప్రపంచం ఎంతో అందంగానూ పరిశుభ్రంగానూ ఉండేది. కానీ రాను రాను జన సాంద్రత పెరిగింది, టెక్నాలజీ పేరుతో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో అడవులు కాస్త ఫ్లాట్లు గా , ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. అధిక వాహనాల వినియోగం వలన మన పరిసరాలు కాలుష్యంతో నిండిపోయాయి. తద్వారా మనుషులు అనారోగ్య పాలవుతున్నారు. మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో కూడా మార్పు రావడంతో ఇది కూడా ఒకరకంగా మనకు హాని కలిగిస్తోంది. తద్వారా మనుషుల ఆయుష్షు తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు జనాలు 80 ఏళ్ళు 90 ఏళ్లకు మించి ఆరోగ్యంగా జీవించే వారు. అయితే ఇప్పటి కాలంలో అంతటి అదృష్టం నూటికో కోటికో ఒకరికి మాత్రమే దక్కుతోంది మిగిలిన వారు 65 నుండి 70 బ్రతకడమే కష్టంగా తయారవుతోంది. ఇలాంటి ఈరోజుల్లో క్రుగర్ 111 ఏళ్ళు దాటినా ఇంకా ఆరోగ్యంగా జీవిస్తుండడం, దాని వెనకున్న రహస్యం కోడి మెదడు అని క్రుగర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి