ప్రభుత్వం ప్రకటన వచ్చిన నాటి నుంచి రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 700 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాకు చేరుకుంది కూడా. అటు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతుల పాదయాత్రకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అమరావతి మాత్రమే రాజధాని అని.. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కూడా. ఇక ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది రాష్ట్ర హైకోర్టు. సీఆర్డీయే చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు చట్టాలకు గవర్నర్ ఆమోదం లభించినా కూడా... న్యాయస్థానంలో కేసులు అడ్డుగా మారాయి. వీటిపై రోజు వారి విచారణ చేపట్టిన హైకోర్టు... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ప్రకటన వచ్చిన నాటి నుంచి రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 700 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాకు చేరుకుంది కూడా. అటు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతుల పాదయాత్రకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అమరావతి మాత్రమే రాజధాని అని.. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కూడా. ఇక ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది రాష్ట్ర హైకోర్టు. సీఆర్డీయే చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు చట్టాలకు గవర్నర్ ఆమోదం లభించినా కూడా... న్యాయస్థానంలో కేసులు అడ్డుగా మారాయి. వీటిపై రోజు వారి విచారణ చేపట్టిన హైకోర్టు... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.