
అధికార పార్టీని ఎవరూ టచ్ చేయలేరని నిజానికి ఆంధ్రా ప్రజలు కనీసం టచ్ చేసే అవకాశం కూడా ఇవ్వరని రానున్న 2024 ఎన్నికల్లోనే కాదు ఆపై వరుస ఎలక్షన్స్ లోనూ రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ వై ఎస్ జగనే ఏపి సిఎం అవుతారని, జనం దగ్గరుండి గెలిపిస్తారని అన్నారు. సింహం ఎపుడు కూడా సింగిల్ గానే వస్తుంది తప్ప ఎవరి పొత్తు కోరదని సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతేనని అన్నారు. అయితే ఇలా ఒకరి మీద ఒకరు కామెంట్ లు చేసుకుంటే గెలుపు రాదని, ప్రజలకు నచ్చే పనులు ప్రజల కోసం చేస్తే ఓట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే రాబోయే ఎన్నికలలో గెలవాలి అనుకున్న పార్టీలు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల ముందుకు వెళ్ళాలి. వారికీ అవసరం అనిపించినా పనులను చేస్తామని హామీ ఇచ్చి దానిని నిలబెట్టుకునే దిశగా అడుగులు వెయ్యాలి. అప్పుడే ప్రజలు ఏ పార్టీని అయినా సరే నమ్మి ఓటేస్తారు. మరి అటువంటి మార్పు రాజకీయ పార్టీలలో వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.