కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు..ఈ మధ్య కాలంలో జీతాలు కూడా భారీగానే పెరిగాయి.అంతేకాదు..ఇటీవల ఉద్యోగులకు డీఏ పెంచిన విషయం తెలిసిందే. దసరా, దీపావళి కానుకగా కేంద్రం డీఏను పెంచింది. అలాగే.. 18 నెలల డీఏ బకాయిలను కూడడా చెల్లించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. ఉద్యోగుల వైఖరితో ప్రభుత్వం దిగి వచ్చింది.. వారికి జీతాల పెంపును ప్రకటించింది.


గత ఏడాది ఆగస్టులోనే నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా కేబినేట్ సెక్రటరీ, నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కు లెటర్ పంపించారు. 18 నెలల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. వెంటనే ఆ బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల అకౌంట్ లో పడనున్నాయి.18 నెలల డీఏ బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కేంద్రం బకాయిల విషయంలో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివర్లోగా కేంద్రం పెండింగ్ లో ఉన్న బకాయిలపై ఒక నిర్ణయం తీసుకోనుంది.


ఈ నిర్ణయం తీసుకోగానే.. వెంటనే బకాయిల డబ్బు మొత్తం ఉద్యోగుల అకౌంట్ లో జమకానున్నాయి. లేవల్ 1 ఉద్యోగులకు డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు పడనున్నాయి. లేవల్ 13 ఉద్యోగులు అయితే.. ఏడో సీపీసీ బేసిక్ పే స్కేల్ ప్రకారం రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు పొందే అవకాశం ఉంది.లేవల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పొందుతారు. జనవరి 1, 2020 నుంచి జూన్ 20, 2021 వరకు అంటే దాదాపు 18 నెలల డీఏ బకాయిలు చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అందుకే డైరెక్ట్ గా ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలోనే బకాయిలను చెల్లించాలని కేంద్రం యోచిస్తోంది. రిటెయిల్ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల.. డీఏ, డీఆర్ చెల్లింపును ఆపేశారని, మరోవైపు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయని, ఇటువంటి సమయంలో వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని పెన్షనర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: