తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ సూపర్ సిక్స్ హామీలతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సరికొత్త విజయాన్ని తీసుకువస్తానంటూ తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున శ్రీకాకుళం ఇచ్చాపురంలో శంకరావం పేరుతో లోక్సభ ఎన్నికలను సైతం ప్రారంభించారు. బహిరంగ సభలలో ఆయన ప్రసంగిస్తూ.. బాబు హామీ భవితకు హామీ అంటూ ఒక సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ తెలియజేశారు.. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం.. అలాగే పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థులకు 15000 చొప్పున ఇస్తామని..


అలాగే ప్రతి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ.. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి నెలకు 3000 అన్నట్టుగా తెలియజేశారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళలకు కూడా 1500 చొప్పున ఇస్తామంటూ తెలిపారు అలాగే ప్రతి రైతుకు కూడా ఏడాదికి 20వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటూ కూడా తెలియజేశారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉత్తరాంధ్రను గంజాయి దండగ మార్చాలంటూ విమర్శించారు. ఆయన చేసిన ఐదేళ్ల పానాలలో కనీసం ఒక్కసారైనా జిల్లా సెక్షన్ కమిటీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా యువతను మోసం చేశారంటూ ఎద్దేవా చేశారు.


 వైసిపి నాయకుల పేర్లతో కూడిన ఒక రెడ్ బుక్కును కూడా తన దగ్గర ఉంచుకున్నానని చంద్రబాబు నాయుడు ను అక్రమంగా 53 రోజులపాటు జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టిందని.. తన దగ్గర ఉండే రెడ్ బుక్కును చూసి వైసిపి నాయకులు భయపడుతున్నారు అంటూ  తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తాము అధికారంలో ఉన్నప్పుడు 1.7 లక్షల పోస్టులను భర్తీ చేశామంటూ కూడా తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన ప్రభుత్వంతో కలిసి ఏటా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులన్నిటినీ కూడా విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే పలు రకాల సంక్షేమ పథకాల ద్వారా 10 రూపాయలు ఇచ్చి ₹100 వెనక్కి తీసుకుంటున్నారంటూ కామెంట్స్  చేస్తున్నారు లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: