ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా బిజెపి టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా బిజెపి పార్టీ చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటుందని ఎంతో ఆశతో ఉన్నారు. ఆంధ్రాలో ఎన్నికలు సాఫీగా సాగాలని టిడిపి ఆలోచనలో ఉన్నది. ముఖ్యంగా ఎలక్షనిరింగ్ విషయంలో బిజెపి సహాయం ఉంటుందని టిడిపి చాలా ఆశలు పెట్టుకుంది. వైసీపీని కట్టడి చేయడంలో కేంద్రం టిడిపి పార్టీకి సహాయం చేస్తుందని చంద్రబాబు కూడా భావించారు. అందుకే ఎన్నో ప్రయత్నాలతో పొత్తులను కుదురుచుకున్నారు. అయితే వీటికి భిన్నంగా మాత్రం బిజెపి కూటమి వ్యవహరిస్తోందన్నట్టుగా కనిపిస్తోంది.


ఈ విషయం పైన చంద్రబాబు కాస్త అసహనంతో ఉన్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి కచ్చితంగా 17 రోజులు సమయం మాత్రమే ఉన్నది. దీంతో గట్టిగా సమయం కూడా లేకపోవడంతో బిజెపి కూడా అనుకున్న విధంగా సహాయం చేయకపోతే ఎలా అనే భయం చంద్రబాబులో పట్టుకుందట. ముఖ్యంగా ఆంధ్రాలో డీజీపీని అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ చేయాలని ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. వీరంతా వైసిపి పార్టీకి సహకరిస్తున్నారని అనుమానాలను కూడా టిడిపి వ్యక్తం చేసింది.


సామాజిక పెన్షన్ విషయంలో కూడా ఏప్రిల్ నెలలో చాలా రచ్చ కొనసాగింది. ఈ విషయం పైన కూడా తెలుగుదేశం పార్టీ పైన చాలా ఎదురుదెబ్బ తగిలిందని కూడా చెప్పవచ్చు. మే నెల కూడా రాబోతున్న తరుణంలో ఈ నెల అయినా సరే సాఫీగా వృద్ధులకు ఇంటికి వెళ్లి పింఛన్ అందించేలా చూడాలన్నట్టుగా కోరుతున్నారు టిడిపి అధినేత.. మే నెలలో పెన్షన్ మరొకసారి రచ్చ అయితే కచ్చితంగా ఈ విషయం కూటమిపైన తీవ్రమైన ప్రభావం పడుతుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే వాలంటరీలను కూడా తప్పించడం జరిగింది అనే వార్తలయితే వినిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులో భాగంగా నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారు ఎప్పుడు వస్తారో తెలియడం లేదు.. ఎంత ఉన్న పవన్ చంద్రబాబు వంటి వారే మీటింగులు పెడుతూ ఉన్నారు. కాస్త ప్రజలకు బోరు కొట్టింది.. గతంలో ప్రధాని మోడీ సీఎం జగన్ పైన ఎలాంటి విమర్శలు కూడా చేయకపోవడంతో కూటమిలో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో బిజెపి పార్టీకి ఎలాంటి పాపులారిటీ లేకపోయినా..6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: