
కాళేశ్వరం డ్యాం నిర్మాణంలో అవకతవకలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ, రిపోర్ట్ ఎవరు ఇచ్చారనేది ముఖ్యం కాదని, అవినీతి జరిగిందా అనేదే కీలకమని అన్నారు. ఆ సంస్థ చట్టబద్ధంగా ఏర్పాటై, తన బాధ్యతలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పారదర్శకతతో ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని కోరారు.
కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కూడా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తలతోకలేని మాటలు మాట్లాడుతూ, గత ఏడాదిన్నరగా అసెంబ్లీకి, ప్రజల మధ్యకు రాకుండా ఫార్మ్హౌస్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ కార్యక్రమాలను బహిష్కరించి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేదని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయని, కేసీఆర్ ఈ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నక్సలైట్ల విషయంలో కిషన్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. తుపాకులు పట్టుకుని శాంతి చర్చలు జరపడం సాధ్యం కాదని, వారు తుపాకులు వదిలి ప్రజల్లోకి వస్తే సమాజానికి మేలని అన్నారు. శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని, ప్రజలకు న్యాయం చేస్తుందని పునరుద్ఘాటించారు.
94905 20108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు