ఇండియన్ ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ వణికి పోతుంది. ఇప్పటికే చాలామంది పాక్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ ప్రజలు కాదు పాకిస్థాన్లోని ఉగ్మూఖలే మా టార్గెట్ అంటూ చెబుతోంది. కానీ పాకిస్తాన్ వాళ్లు మాత్రం ఇండియన్ ప్రజలే టార్గెట్ గా పెట్టుకొని చిన్న పిల్లలని కూడా చూడకుండా దాడులు చేస్తూ చంపేస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తూ కూర్చోకుండా భారత్ పాకిస్తాన్ కి దీటుగా బదిలిస్తోంది.ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడంతో పాకిస్తాన్ కూడా మిస్సైల్ తో దాడి చేస్తోంది. కానీ ఈ మిస్సైల్ లను గగనతలంలోనే కూల్చి వేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇప్పటికే భారత్లోని ఎన్నో ప్లేస్ లను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ మిస్సైల్ దాడి చేసినప్పటికీ భారత్ దాన్ని తిప్పి కొట్టింది. పాకిస్తాన్ యుద్ధ విమాలను చిత్తుచిత్తు చేసింది. 

అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక బాంబు పేలిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ బాంబు పేలడంతోనే వెంటనే అధికారులు అప్రమత్తమై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ని స్థానికంగా ఉన్న ఓ బంకర్లోకి సురక్షితంగా చేర్చారు. అయితే భారత ఆర్మీ దెబ్బకు విల విల లాడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ ఇక మేం యుద్ధం చేయలేము అంటూ కొంతమంది చేతులు ఎత్తేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ప్రాణభయంతో వేరే దేశానికి పారిపోవాలి అని చూస్తున్నట్టు కొన్ని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి.

అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో పాటు కొంతమంది ప్రధానంగా ఉండే ఆర్మీ అధికారులు దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారట.ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షరీఫ్ బహ్రెయిన్ కి పారిపోతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఒక స్పెషల్ విమానంలో ప్రధాని షరీఫ్, కొంతమంది ఆర్మీ అధికారులు బహ్రెయిన్ కి వెళ్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సైలెంట్ గా ఉన్న భారత్ ని గెలికి మరీ యుద్ధం కొని తెచ్చుకుంది పాకిస్తాన్ అంతకంతకు అనుభవిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: