
ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ఇక పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల తమ ప్రగాడ సంతాపం కూడా వ్యక్తం చేశారు. రాజకీయ .. సినీ ప్రముఖులు మురళీ నాయక్ మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, నాయకులు మురళీ నాయక్కు తమ నివాళి తెలిపారు.
ఇదిలా ఉంటే సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్న ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మురళీ నాయక్ మృతిపై తన సంతాపం తెలిపారు. ఆ వీర జవాన్ కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపిన బాలయ్య తన ఒక నెల జీతాన్ని ఆ కుటుంబానికి అందించనున్నట్టు ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామంలో ఆయన తల్లిదండ్రులకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు