ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఆడపిల్లలకు అన్నగా రక్షణగా ఉంటానని.. ఏపీ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని.. సుగాలి ప్రీతి కేసు గురించి కూడా చెప్పడమే కాకుండా సుమారుగా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని వారందరినీ తీసుకొస్తానంటూ ఎన్నికల ముందు ఏవేవో మాటలు చెప్పారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ ఆ విషయాల పైన పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదంతా పక్కన పెడితే గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగిన ఘటన పొలిటికల్ పరంగా హాట్ టాపిక్ గా మారుతోంది.



అయితే ఈ ఘటనను ఇటీవలే సినిమా టికెట్ల విషయంపై చాలామంది మరిచిపోవడంతో తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ తన అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేస్తూ మళ్ళీ వైరల్ గా చేస్తోంది. ఈ ట్విట్టర్లో.. క్రిమినల్స్ కు శిక్ష పడే వరకు వాయిస్ రైస్ చేయాలి అంటూ తెలియజేసింది. మీడియా ఈ విషయాన్ని ఎందుకు కవర్ చేయడం లేదని.. పొలిటికల్ లీడర్స్ మీద అసలు నమ్మకం లేదంటూ ఆమె తెలియజేసింది.. మన వినిపించేటువంటి వాయిస్ తో.. యానిమల్స్ చేతిలో మరొకరు బలి కాకుండా ఉంటారు అంటూ సూచించింది. ఆ బాధితురాలికి న్యాయం చేయాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేస్తుంది.


అయితే ఈ ట్విట్టుకు చాలామంది జనాలు కూడా హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది..ఇలాంటి విషయాలపైన మీలాంటి వారి స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ  కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈమెలాగే మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం మంచిది అంటూ తెలియజేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయం పైన స్పందించలేదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. వైసీపీ పార్టీ అధికారంలో ఉంటేనే వీటిపైన విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్  రచ్చ చేసేవాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: