వైఎస్ జగన్ జూలై 16, 2025న జరిగిన "కీలక ప్రెస్ మీట్" గురించి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. కానీ, ఈ మీట్‌లో కొత్తగా ఏమీ లేదని, సాక్షి పేపర్‌లో వచ్చిన పాత తప్పుడు కథనాలను మళ్లీ చెప్పడమే జరిగిందని విమర్శలు వచ్చాయి. "కీలక" అనే పదం సోషల్ మీడియా అల్గారిథమ్‌ను ఆకర్షించేందుకు వాడినట్లు కనిపిస్తుంది .ఈ మధ్య కాలంలో వైసీపీ చేసిన స్క్రిప్టెడ్ డ్రామాలు విఫలమయ్యాయి . ఉదాహరణకు , గుడివాడ లో పేర్ని నాని "రప్పా రప్పా" డైలాగులతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యాయి .


అలాగే, బంగారుపాలెంలో మామిడి కాయలు రోడ్డుపై పోసిన సంఘటనను రైతులు, పోలీసులు స్క్రిప్టెడ్ డ్రామాగా విమర్శించారు. జగన్ ఈ డ్రామాలను సమర్థించారు, సినిమా డైలాగులు సెన్సార్ కానందున వాడవచ్చని , బాలకృష్ణ , పవన్ సినిమాలను నిషేధించాలని వాదించారు , ఇది విచిత్రంగా లేదా హాస్యాస్పదంగా అనిపించింది  . జగన్ పోలీసు వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు . డీజీపీ ని "మాఫియా డాన్" అని , సీఐలు కలెక్షన్లు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని అన్నారు . ఇవి వైసీపీ నాయకుల పై కేసుల నుంచి తప్పించుకు నే ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తాయి . కేతిరెడ్డి, నల్లపురెడ్డి వంటి నాయకులపై కేసులు అన్యాయమని జగన్ వాదించారు, ఇలాంటి ఆణిముత్యాలతో ప్రెస్ మీట్ నడిచిపోయింది.


జగన్ చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో కూలిపోతుందని , తాను తిరిగి అధికారంలోకి వస్తానని అన్నారు . ప్రజలు తన వద్దకు వ‌చ్చి బాధలు చెప్పడానికి వస్తున్నారని చెప్పారు , కానీ వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ, నిర్దిష్ట వ్యక్తులను కలుస్తున్నారని విమర్శలు ఉన్నాయి . ప్రతిపక్ష నాయకుడి గా జగన్ ప్రజల సమస్యల పై పోరాడకుండా , ఇలాంటి ప్రెస్ మీట్‌ల తో సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నార ని విమర్శకులు అంటున్నారు. ఈ ప్రెస్ మీట్ వైసీపీ కి ప్రతికూల ప్రచారాన్ని తెచ్చిపెట్టింది , అలాగే ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతు ఏ విషయంలో ఆయన ప్రజల కోసం పని చేస్తున్నారో చెప్పుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: