
ఈ సమావేశంలో జనసేన జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపి, ఈ చర్యలకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం ఆమోదించింది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన దృష్టిని మరింత స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ మహిళల సంక్షేమం, రక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు సూచించారు. రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల నిర్మాణం వంటి అంశాలను పర్యవేక్షించాలని నేతలకు స్పష్టం చేశారు.
ఈ చర్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనసేన స్థానాన్ని బలపరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, కూటమి ఐక్యతకు దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త నాయకత్వాన్ని, యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీ బలాన్ని పెంచాలని సూచించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు