
నైపుణ్య శిక్షణను మరింత బలోపేతం చేయడానికి, 23 విభాగాల డేటాబేస్ను నైపుణ్యం పోర్టల్లో ఇంటిగ్రేట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను మిషన్ మోడ్లో అభివృద్ధి చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలల స్థితిగతులపై అధ్యయనం నిర్వహించాలని సూచించారు. రోజ్గార్ యోజన, పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ విధానాన్ని అధ్యయనం చేయాలని, యూరప్, జీసీసీ దేశాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.
విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరులో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడు హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ మూడు హబ్లకు అనుబంధంగా 13 స్పోక్ హబ్లను స్థాపించనున్నారు. ఈ కేంద్రాలు యువతకు నైపుణ్య శిక్షణను మరింత సమర్థవంతంగా అందించేలా రూపొందించనున్నారు. ఐటీఐ కళాశాలల్లో ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరచడానికి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ చర్యలు రాష్ట్ర యువతకు స్థానికంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కీలకమైనవిగా భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు