
పరిశ్రమలకు వ్యతిరేకం కాదని మత్స్యకారులు చెబుతున్నప్పటికీ, వ్యర్థాల శుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పవన్ గుర్తించారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం మత్స్య సంపదకు హాని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మూడు విడతల్లో పరిశీలించి, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యర్థాలు సముద్రంలో కలిసే ప్రాంతాలను స్వయంగా బోటులో వెళ్లి పరిశీలిస్తానని ప్రకటించారు.కాలుష్య నియంత్రణ కోసం 100 రోజుల సమయం కావాలని పవన్ కోరారు.
ఈ గడువులో కాలుష్య తగ్గింపుకు రోడ్మ్యాప్ రూపొందిస్తామని, వ్యర్థాలపై ఆడిట్ నిర్వహించడానికి సమయం అవసరమని వివరించారు. పరిశ్రమల వ్యర్థాల నిర్వహణపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతామని, పరిహార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. ఈ చర్యలు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటంలో కీలకమవుతాయని భావిస్తున్నారు.తాను ఇచ్చిన హామీలను పదవీ కాలం పూర్తయ్యేలోపు నెరవేర్చి తీరతామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
ప్రజలను వంచించే ఉద్దేశం తనకు లేదని, వారి సమస్యలను హృదయపూర్వకంగా పరిష్కరించాలనే సంకల్పంతో పనిచేస్తానని చెప్పారు. మత్స్యకారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా వారి జీవనోపాధిని రక్షించే దిశగా అడుగులు వేస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యaలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు