
ఇప్పటికే కేటీఆర్ నిర్వహించిన రెండు మూడు సభలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ పై మరింత దృష్టి సారించారు. ప్రతి ఓటరుకు వ్యక్తిగతంగా చేరుకోవడం ద్వారా బీఆర్ఎస్కు మళ్లీ ప్రజల్లో నమ్మకం కల్పించాలనే లక్ష్యంతో కేటీఆర్, ఆయన బృందం కసరత్తులు చేస్తున్నాయి. అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లో బలంగా చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి ప్రచారంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారన్న వార్త గులాబీ శిబిరానికి కొత్త ఊపునిస్తోంది. ఈ ఎన్నిక పార్టీ భవిష్యత్తుకు కీలకమని, గెలుపు తప్ప ఇంకే ఆప్షన్ లేనట్టే అని భావిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. కేసీఆర్ బరిలోకి దిగితే కేడర్ మళ్లీ ఉత్సాహం పొందుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం, కేసీఆర్ పాల్గొనేలా ఇప్పటికే ప్రచార షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న జూబ్లీహిల్స్లో భారీ రోడ్ షో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆ రోజునే ఆయన రెండు సభల్లోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరి రోజు వరకు కూడా ప్రచార వేడి కొనసాగించేలా, లాస్ట్ మూడు రోజుల్లో ఒకవైపు కేటీఆర్, హరీశ్రావు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయగా, మరోవైపు కేసీఆర్ సబా సర్క్యూట్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ బైఎలక్షన్ ఫలితం పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నింటికి మించి ఇక్కడ క్యాండెట్ను ఖరారు చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు కేటీఆరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే భవిష్యత్తు గులాబీ రాజకీయాల్లో కేటీఆర్ తిరుగులేని కింగ్ అవుతాడు అనడంలో సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.